కర్నూలు: తనకు పత్రిక లేదని, పరిశ్రమలు లేవని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. "సాక్షి"లో బోగస్ సంస్ధల పెట్టుబడులపై ఆయన విరుచుకు పడ్డారు. తాను సినిమాల్లో కష్టపడి డబ్బు సంపాదించుకున్నానని, కాంగ్రెస్, తెలుగుదేశం నాయకుల్లాగా అవినీతికి పాల్పడలేదని ఆయన అన్నారు.
దేవేందర్ గౌడ్ నాయకత్వంలోని నవ తెలంగాణ పార్టీ ప్రజారాజ్యంలో విలీనమైతే తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. నిన్న తన రోడ్ షోలో నందికొట్కూరులో మరణించిన తన అభిమాని మహబూబ్ కు లక్ష రూపాయల విరాళాన్ని చిరంజీవి ప్రకటించారు.