ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూత్ మా వెంటే..పవన్ ధీమా

By Staff
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
హైదరాబాద్‌: యవతని ఆకర్షించడంలో తాము విజయం సాధించామని, వారంతా ప్రజారాజ్యం పార్టీ వెంటే ఉన్నారని యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధీమా వ్యక్తం చేసారు. రాజకీయలంటే అసహ్యించుకునే యువత పీఆర్పీ వచ్చాక తమ వైఖరిని మార్చుకున్నారని వారందరు తమ వైపు వస్తున్నారని ఆయన అన్నారు. ఏలూరు, భీమవరంలలో జరిగే యువజన సదస్సుల్లో పాల్గొనేందుకు వెళ్లేముందు ఆయన బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు యువతను పట్టించుకోనందునే వారు రాజకీయాలకు దూరంగా ఉన్నారని అన్నారు.

యువత ఎదుర్కొనే నిరుద్యోగ, ఉపాధి కల్పన వంటి సమస్యలకు ప్రజారాజ్యం మార్గం చూపుతుందని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు యువతను పట్టించుకోలేదని అందుకే వారు రాజకీయాలకు దూరంగా ఉన్నారని అన్నారు. ప్రజారాజ్యం అధికంరలోకి వస్తే యువత సాధికారతకు సమగ్ర విధానం రూపొందిస్తామని, వారికి శాశ్వత ప్రాతిపాదిక ఉపాధి కల్పిస్తామని ఆయన హామి ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీలో నవ తెలంగాణ పార్టీ విలీనం గురించి మీడియా వారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, దేవేందర్‌ గౌడ్‌ తమతో కలిసి వస్తే పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X