ఏం..సీఎం..గడ్డి పీకుతున్నారా?
హైదరాబాద్: '2007 ఏప్రిల్లో కుప్పం ప్రాజెక్టుపై నియమించిన విచారణ కమిషన్ నివేదిక ఇచ్చి రెండేళ్లయింది..అప్పటి నుంచి సీఎం, మంత్రులు సచివాలయంలో గడ్డి పీకుతున్నారా?' అని టీడీపీనేతలు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యు డు నాగం జనార్దనరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, కే విజయరామారావు, వర్ల రామయ్య నిన్న (మంగళవారం) సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
అధికారం అంత్యదశకు చేరుకున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని వారు తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.న్యాయవిచారణ నివేదిక వచ్చిన రెండేళ్ళ తర్వాత ఇప్పుడు కుప్పం ప్రాజెక్టుపై సీబీసీఐడి విచారణ జరపాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని, చంద్రబాబు సమీప బంధువు నార్నె శ్రీనివాసరావుపై ఐటీ దాడులను, కడియం శ్రీహరిపై కేసును ప్రస్తావించిన టీడీపీనేతలు ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపించారు.
కుప్పం ప్రాజెక్టుపై సీబీ సీఐడి విచారణకు తామేమీ అభ్యంతరం చెప్పడంలేదని, ఇలాంటి వంద విచారణలు వేసినా భయం లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే తన నియోకజవర్గం నాగర్ కర్నూలులో నామినేషన్ వేయాలని నాగం జనార్దనరెడ్డి సవాలు చేశారు. ముఖ్యమంత్రి కేసులు పెడితే భయపడి రాజకీయాలు మానుకోబోమన్నారు.
రాష్ట్రంలో చేపట్టిన ఇజ్రాయిల్ సేద్యం ఆదర్శప్రాయంగా ఉందన్న ముఖ్యమంత్రి ఇప్పుడు మరో విచారణకు ఎందుకు ఆదేశించారని వారు ప్రశ్నించారు. అవినీతిపై విపక్షాలు సీఎం బట్టలూడ దీశాయి. సిగ్గు విడిచి చివరి కేబినెట్లో బాబుపై విచారణకు ఆదేశించారని దుయ్యబట్టారు. 60 రోజులుపోతే వైఎస్ అందరినీ చంచల్గూడ జైలుకే తీసుకెళ్తారని, ఆయన కుటుంబ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినవారు కూడా కోర్టు బోను ఎక్కక తప్పదని హెచ్చరించారు.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications