న్యూఢిల్లీ:
ఎప్పుడెప్పుడా
అని
అందరూ
ఎదురుచూస్తున్న
నానో
కారు
త్వరలోనే
మార్కెట్లో
దర్శనమివ్వనుంది.
టాటా
మోటర్స్
వారు..తమ
నానో
కారును
మార్చి
23న
ముంబయిలో
లాంఛనంగా
ప్రవేశపెడతామని
ఏప్రిల్నుంచి
బుకింగ్స్
ప్రారంభిస్తామని
తెలియజేసింది.
అలాగే
స్టేట్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
నుండి
ఈ
కారుని
బుక్
చేసుకోవచ్చునని
తన
ప్రకటనలో
తెలియచేసింది.
ఏప్రిల్
మొదటివారంలో
ఈ
కారును
టాటా
షోరూముల్లో
డిస్ప్లేకు
ఉంచుతామని,
రెండవవారంలో
బుకింగ్స్
ఉంటాయని
కంపెనీ
ప్రతినిధులు
తెలిపారు.
ప్రపంచంలో
అత్యంత
తక్కువ
రేటుకే
(లక్షకే)
లభిస్తుందంటూ
ప్రచారం
పొందుతున్న
ఈ
కారు
బుకింగ్స్
కూడా
సంచలన
రీతిలో
ఉంటాయని
మార్కెట్
వర్గాలు
భావిస్తున్నాయి.