హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వేసిన కమిటి పిచ్చాసుపత్రి లాంటిదన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి రోశయ్య మండిపడ్డారు. ప్రత్యేకరాష్ట్రం కోసమంటూ..కేసీఆర్ వేసే కుప్పిగంతులు ఎవరికీ అర్ధం కావటం లేదని రోశయ్య అన్నారు. కేసీఆర్ కు నోరుజారి మాట్లాడటం పరిపాటేనని విమర్శించారు. రాజకీయాల్లో ఏ పార్టీనీ భూస్థాపితం చేయలేమని రోశయ్య తెలిపారు. రానున్న ఎన్నికల్లో కనుచూపు మేర విజయావకాశాలు కనబడకే తమపై దిగుజారుడు విమర్శలు గుప్పిస్తున్నారని రోశయ్య దుయ్యబట్టారు.