కలెక్టర్లను లైన్ లోకి తెచ్చిన సుబ్బారావు
హైదరాబాద్: కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐవి సుబ్బారావు గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియామావళి అమలవుతున్న తీరు, కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై తీసుకోవలసిన చర్యలపై సుబ్బారావు సమీక్ష జరుపుతున్నారు. దీనితో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ఇప్పటివరకూ ఆయా జిల్లాలలో నేతలు కోడ్ ఉల్లంఘించినట్లు ఎన్నికల నిఘా వేదిక ఈసి దృష్టికి తీసుకురావడమే తప్ప, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై సుబ్బారావు నిర్దేశకాలను జారీ చే యనున్నారు. ఎన్నికల నిర్వహణ, భద్రతపై కూడా సమీక్ష జరపనున్నారు.
Comments
Story first published: Thursday, March 5, 2009, 11:49 [IST]