వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రాందీ కింగ్ కే గాందీ వస్తువులు

By Staff
|
Google Oneindia TeluguNews

Vijay Mallya
న్యూయార్క్: వివాదంగా మారిన గాంధీజీ జ్ఞాపికల వేలం ముగిసింది. ప్రముఖ లిక్కర్ వ్యాపార వేత్త విజయ మాల్యా 18 లక్షల డాలర్లు పెట్టి ఈ వేలంలో గాంధీజీ జ్ఞాపికలను సొంతం చేసుకున్నాడు. మొదట్లో ఈ వేలం నిలిపివేస్తానని వీటిని సేకరించిన జేమ్స్‌ ఓటిస్‌ ప్రకటించినప్పటికీ వేలం పాట మాత్రం జరిగిపోయింది. ఈ వేలంలో పాల్గొనటానికి దాదాపు ముఫ్ఫై మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారని, దాన్ని రద్దు చేస్తే వారి నమ్మకాన్ని కోల్పోతాన్ని అందుకే వేలం జరిపానన్నాడు.

వాస్తవానికి భారత ప్రభుత్వానికి జేమ్స్‌ ఓటిస్‌కు మద్య గాంధీజీ జ్ఞాపికల వేలం నిలిపివేతపై అనేక విడతలుగా గురువారం నాడు చర్చలు జరిగాయి. భారత ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ చొరవ తీసుకుని ఏది ఏమైనా ఈ జ్ఞాపికలను భారతదేశానికి తీసుకు వచ్చేటట్లు చూడవలసిందిగా కేం ద్ర సాంస్కృతి శాఖ మంత్రి అంబికా సోనీని ఆదేశించారు.అయితే ఈ చర్చలు..చర్చల దశలోనే ఉండగా.. ఎన్‌.ఆర్‌.ఐ.ల ప్రతినిధిగా సంత్‌ సింగ్‌ చత్వాల్‌ కాలిఫోర్సియా నుంచి న్యూయార్క్‌ చేరుకోగా మరో వైపు ఆ స్ట్రేలియా తదితర దేశాల నుంచి గాంధీజీ అభిమానులు ఈ వేలంలో పాల్గొని జ్ఞాపకాలను కొనుగోలు చేసి భారతదేశానికి అప్పగించే లక్ష్యంతో ముందుకు వచ్చారు.

గాంధీజీ జ్ఞాపికలను ముందు 23-30 వేల డాలర్లు బిడ్డింగ్‌ ప్రైస్‌గా పెట్టిన ఏంటి కోరమ్‌ కంపెనీ ఆ తరువాత రేటును బాగా పెంచేసింది. ఈ నాటకీయ పరిణామాల మధ్య విజయ మాల్యా బిడ్డింగ్‌లో పాల్గొని 18 లక్షల డాలర్లకు వీటిని కొనుగోలు చేశారు. దీంతో భారతీయుడే వీటిని కొనుగోలు చేయటంతో చాలా మంది సంతృప్తి చెందారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X