బ్రాందీ కింగ్ కే గాందీ వస్తువులు
వాస్తవానికి భారత ప్రభుత్వానికి జేమ్స్ ఓటిస్కు మద్య గాంధీజీ జ్ఞాపికల వేలం నిలిపివేతపై అనేక విడతలుగా గురువారం నాడు చర్చలు జరిగాయి. భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చొరవ తీసుకుని ఏది ఏమైనా ఈ జ్ఞాపికలను భారతదేశానికి తీసుకు వచ్చేటట్లు చూడవలసిందిగా కేం ద్ర సాంస్కృతి శాఖ మంత్రి అంబికా సోనీని ఆదేశించారు.అయితే ఈ చర్చలు..చర్చల దశలోనే ఉండగా.. ఎన్.ఆర్.ఐ.ల ప్రతినిధిగా సంత్ సింగ్ చత్వాల్ కాలిఫోర్సియా నుంచి న్యూయార్క్ చేరుకోగా మరో వైపు ఆ స్ట్రేలియా తదితర దేశాల నుంచి గాంధీజీ అభిమానులు ఈ వేలంలో పాల్గొని జ్ఞాపకాలను కొనుగోలు చేసి భారతదేశానికి అప్పగించే లక్ష్యంతో ముందుకు వచ్చారు.
గాంధీజీ జ్ఞాపికలను ముందు 23-30 వేల డాలర్లు బిడ్డింగ్ ప్రైస్గా పెట్టిన ఏంటి కోరమ్ కంపెనీ ఆ తరువాత రేటును బాగా పెంచేసింది. ఈ నాటకీయ పరిణామాల మధ్య విజయ మాల్యా బిడ్డింగ్లో పాల్గొని 18 లక్షల డాలర్లకు వీటిని కొనుగోలు చేశారు. దీంతో భారతీయుడే వీటిని కొనుగోలు చేయటంతో చాలా మంది సంతృప్తి చెందారు.