వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎనీ సెంటర్ రెడీ: బాలయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
నెల్లూరు : తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే రాష్ట్రంలోని ఎక్కడినుంచైనా ఎన్నికలబరిలోకి దిగుతానని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. అలాగే చంద్రబాబు ప్రకటించిన మేనిపేష్టో గురించి మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయం పెరిగిన దృష్ట్యా పార్టీ ప్రకటించిన పథకాలకు ఎలాంటి ఇబ్బందులుండవని స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న బాలకృష్ణ ఎన్నికల ప్రచారయాత్రను ఆదివారం ఉదయం 9.10 గంటలకు బాలకృష్ణ చైతన్యరథం ఎక్కి ప్రారంభించారు. ఈనెల12వరకూ నెల్లూరు జిల్లాలో పర్యటించి 16నుంచి 20వరకూ ప్రకాశం జిల్లా పర్యటనను చైతన్యరథంపై బాలకృష్ణ నిర్వహిస్తారు.

రెండో విడత నెల్లూరి జిల్లా తడ నుంచి మొదలు అవుతున్న సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి ప్రత్యేకంగా చైతన్యరథం రెడీ చేసారు. పలు ప్రత్యేక సౌకర్యాలతో అధునాతన ఆడియో సౌకర్యంతో రూపొందించిన చైతన్య రథానికి విజయవాడలోని బెంజిసర్కిల్‌ ఆంజనేయస్వామి ఆలయం వద్ద శనివారం ఉదయం బాలకృష్ణ మిత్రులు కాళేశ్వరి ట్రావెల్స్‌ అధినేత చలసాని రవి, చలసాని తేజ, బొర్రా గాంధీ ప్రత్యేకపూజలు నిర్వహించారు. హైదరాబాద్‌లో స్వరాజ్‌మజ్దా వాహనాన్ని పసుపురంగుతో అలంకరించి బాలయ్య బొమ్మలు ముద్రించారు.

రథంలో పార్టీ నియోజకవర్గ ముఖ్యనేతలతో చర్చించేందుకు రెండు సోఫాసెట్లు కూడా ఏర్పాటుచేశారు. చైతన్యరథం నుంచి బాలకృష్ణ ప్రసంగించేందుకు అధునాతన డిజిటల్‌ ఆడియో సౌకర్యం కల్పించారు. ప్రత్యేక జనరేటర్‌, ఎయిర్‌ కండిషన్‌ సౌలభ్యంతో ఏర్పాటుచేసిన ఈ చైతన్యరథాన్ని హైదరాబాద్‌ నుంచి శనివారం ఉదయం విజయవాడ బెంజిసర్కిల్‌కు తీసుకొచ్చారు. కేశినేని ట్రావెల్స్‌ అధినేత నాని, కాట్రగడ్డ బాబు, ఎల్‌. భాస్కరరావు చైతన్యరథాన్ని పరిశీలించారు. ఆదివారం ఉదయం ఈ రథాన్ని బాలకృష్ణ మిత్రులు గాంధి తదితరులు నెల్లూరుకు తీసుకెళ్ళారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X