వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోజాకు పిచ్చి: శోభారాణి
హైదరాబాద్: తెలుగు మహిళ రోజాపై మహిళారాజ్యం అధ్యక్ష్యురాలు శోభారాణి మరోసారి విరుచుకు పడ్డారు. రోజాకు లూజు(పిచ్చి)అని దుయ్యపట్టారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తనవద్ద రోజా విషయం ఎత్తవద్దంటూనే,ఆమెను ఒక్క రోజు మానసిక వికలాంగులతో ఉంచాలని న్యాయమూర్తి ఒకసారి తీర్పు ఇచ్చారని చెప్పారు. తాను న్యాయవాదిగా పనిచేసే సమయంలో చెక్ బౌన్స్ కేసులో రోజా కేసు కోర్టు కొచ్చిందన, తనకు మానసికంగా ఆరోగ్యం సరిగా లేదని ఆమె ఇచ్చిన వాగ్మూలానికి స్పందించిన న్యాయమూర్తి ఇలాంటి తీర్పు ఇచ్చారని వివరించారు. రోజాకు రాజకీయ పరిణితే లేదన్నారు. అలాగే రోజా కి ఆమె ఓ సలహా కూడా ఇచ్చారు. చంద్రగిరి నుంచి పోటీ చేస్తుందిట. అక్కడ ఓటు లేదంటున్నారు. ముందా సంగతి చూస్కో రోజా అని అన్నారు. రోజా నోరే టీడీపీని ఓడిస్తుంది. ఆమె ఎంత ఎక్కువ మాట్లాడితే ఆ పార్టి అంతలా ఓడిపోతుంది అని శోభారాణి అన్నారు.
Comments
Story first published: Sunday, March 8, 2009, 16:20 [IST]