వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు, వైఎస్ తోడు దొంగలు: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
రాజమండ్రి: భారతదేశంలో అత్యంత భారీగా దోచుకున్న రాజకీయ నాయకులను వరుసలో పెడితే వైఎస్, చంద్రబాబు 1, 2 స్థానాల్లో నిలుస్తారని చిరంజీవి వారిపై నేరుగా విమర్శల దాడి చేశారు. అవినీతి 10కే రన్‌లో వైఎస్‌, చంద్రబాబులే చాంపియన్లు. తెలుగుదేశం కిటికీలు తెరిస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వం తలుపులే పీకేసింది. వీరికి దోచుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ అక్షయపాత్రలా కనిపిస్తోందని, ఒకరిపై ఒకరు చర్యలు తీసుకోకుండా మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని మంగళవారం రాత్రి చిరంజీవి రాజమండ్రి సభలో విమర్శించారు.

"చంద్రబాబు ఏడు కేసుల్లో దొరికిపోయారనుకుంటే...వైఎస్‌ వాటిని ఆఖరి నిమిషంలో ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఎల్లంపల్లిలో అవినీతి గురించి 14 రోజులపాటు గగ్గోలు పెట్టిన తర్వాత కావాలనే తప్పుడు లెక్కలు చెప్పామని చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. పరోక్షంగా వైఎస్‌ను రక్షించారు. సత్యం కంప్యూటర్స్‌ను ఇద్దరూ స్వలాభాలకు వాడుకున్నారు. రామలింగరాజును అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారు. దొరికిపోయే సమయం వచ్చేసరికి ఇద్దరూ తప్పించుకుని...ఆయనను జైలుపాలు చేశారు." అని చిరంజీవి ఘాటుగా వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X