చిరు సభ మెగా హిట్

ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత గోదావరి జిల్లాల్లో ఇదే ఆ పార్టీ తొలి బహిరంగ సభ. దీనికితోడు చిరంజీవి వస్తుండటంతో నగరం జనసంద్రమైంది. అడుగడుగునా జనం చిరంజీవికి నీరాజనాలు పలికారు.రాజమండ్రితో తనకున్న సినీబంధంతో సరళంగా మొదలైన ఆయన ప్రసంగం ప్రజారాజ్యం ఆవిర్భావానికి కారణాలు, లక్ష్యాలను వివరిస్తూ గంభీరంగా సాగింది.
వచ్చే ఎన్నికల్లో ప్రజారాజ్యం బడుగు బలహీన వర్గాలకు అత్యధిక సీట్లు కేటాయిస్తుందని చిరంజీవి ప్రకటించారు. రాష్ట్రంలో 30 ఏళ్లనుంచి ఈ వర్గాలను తెదేపా, కాంగ్రెస్లు మోసం చేస్తున్నాయని చెప్పారు. ఎనిమిది జిల్లాల్లో అసలు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదని వివరించారు. అసలు వైఎస్ కడప జిల్లాలో బలహీనవర్గాలకు ఎన్ని సీట్లిచ్చారు? అని నిలదీశారు. రెండు పార్టీలు ఇంతకాలం వెనుకబడిన వర్గాలను పల్లకీ మోసే బోయీలుగా వాడుకుంటున్నాయని, ఇకనైనా ఏకమై, ప్రభువులుగా మారుదామని ఆవేశంగా పిలుపునిచ్చారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications