వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాది నిశ్శబ్ద విప్లవం: చిరంజీవి

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
మచిలీపట్నం: ప్రజలతో తనకున్న అనుబంధం సర్వేలకు అందదని చిరంజీవి అన్నారు. నేడు కృష్ణా జిల్లా నాగాయలంక నుంచి రోడ్ షోలు ప్రారంభించారు. అవినీతి రహిత సమాజం ప్రజారాజ్యం ఆశయమని చిరంజీవి చెప్పారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం చాపకింద నీరులా తమను అధికారంలోకి తెస్తుందని ఆయన అన్నారు.

ప్రజారాజ్యం పార్టీకి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు వెన్నులో వణుకు పడుతోందని తాము ఎక్కవ ఓడిపోతామోనని వారి గుబులు పట్టుకుందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. ప్రజారాజ్యన్ని నిర్వీర్యం చేసేందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు చూస్తూ వూరుకోరన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఆస్తులు పది రెట్లు పెంచుకున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని తుంగలో తొక్కారని ఆయన ధ్వజమెత్తారు.

ఈ అవినీతి రాజకీయ నాయకులు ఇంకా ఎన్నాళ్లు అమాయక ప్రజల భుజాలపై ఎక్కి స్వారీ చేస్తారని, వారిని దించి రాష్ట్రంలో ఉన్న అవినీతి చీకట్లను చీల్చాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో పాలలాంటి స్వచ్ఛమైన ప్రభుత్వం రావాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వం అవినీతికి కిటికీలు తెరిస్తే ఈ ప్రభుత్వం ఏకంగా గోడలు సైతం బద్ధలు కొట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X