హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పాలనే..మందకృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

Mandakrishna Madiga
హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పేందుకే తాము మహాకూటమితో కలవాలని నిర్ణయించుకున్నట్లు మాదిగ హక్కుల పోరాట సమితి(ఎంఆర్‌పిఎస్‌) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు.కాంగ్రెస్‌పార్టీ మాదిగలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఇప్పటికే ఒకసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిసి చర్చించిన మందకృష్ణ మాదిగ తిగిరి నిన్న ఆయనను కలిసి కూటమిలో చేరే విషయంపై చర్చించారు.

ఎస్‌సి వర్గీ కరణకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలంటే మాహాకూటమితో కలిసి పని చేయాలని భావించికున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మహాకూటమిలోని భాగాస్వాములైన టిఆర్‌ఎస్‌, సిపిఎం, సిపిఐ పార్టీలతో ఆయన చర్చించారు. తమ ఓటు బ్యాంకు దృష్టిలో ఉంచుకొని 30 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. దీనిపై చంద్రబాబు మిత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని మందకృష్ణ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X