వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరగబడండి, తెగబడండి: ఎన్టీఆర్

By Staff
|
Google Oneindia TeluguNews

Jr Ntr
విశాఖపట్నం: కాంగ్రెసుపై తిరగబడండి, తెగబడండి ఎగబడండని జూనియర్ ఎన్టీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఉత్తరాంధ్ర పర్యటన బుధవారం విశాఖపట్నం జిల్లాలో కొనసాగింది. 1983లో మాదిరిగా కాంగ్రెసు పార్టీని ఈ ఎన్నికల్లో భూస్థాపితం చేస్తారని ఆయన భిమిలీ రోడ్ షోలో వ్యాఖ్యానించారు. రాష్ట్రం కాంగ్రెసు పాలనలో అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. ఆయన ప్రసంగం వాడిగా వేడిగా సాగింది. ప్రజల ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెసు ఓడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. తనకు చూపిస్తున్న ప్రజల ఆదరణకు ధన్యుడనయ్యానని, మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఒక నెల రోజులు ఆగితే విశాఖ తీరానికి మళ్లీ వస్తానని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందని, ప్రజల రుణాన్ని ఏదో రూపంలో తీర్చుకుంటానని ఆయన అన్నారు.

కాంగ్రెసు అవినీతితో రాష్ట్రం పరువు ఇతర రాష్ట్రాల్లో మంట గలుస్తోందని, ఇది మనకు సిగ్గుచేటని, మనం తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు. మత్స్యకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కోస్తా కారిడార్ పేర ప్రభుత్వం ఉపయోగకరమైన భూమిని లాక్కుంటోందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెసు నాయకులకు ఉపాధి లభిస్తోందని, ప్రజలకు హామీలు మాత్రమే మిగులుతున్నాయని ఆయన అన్నారు. అన్నపూర్ణగా పేరు పొందిన రాష్ట్రాన్ని ఆహారం కొరత చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X