తిరగబడండి, తెగబడండి: ఎన్టీఆర్

Jr Ntr
విశాఖపట్నం: కాంగ్రెసుపై తిరగబడండి, తెగబడండి ఎగబడండని జూనియర్ ఎన్టీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఉత్తరాంధ్ర పర్యటన బుధవారం విశాఖపట్నం జిల్లాలో కొనసాగింది. 1983లో మాదిరిగా కాంగ్రెసు పార్టీని ఈ ఎన్నికల్లో భూస్థాపితం చేస్తారని ఆయన భిమిలీ రోడ్ షోలో వ్యాఖ్యానించారు. రాష్ట్రం కాంగ్రెసు పాలనలో అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. ఆయన ప్రసంగం వాడిగా వేడిగా సాగింది. ప్రజల ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెసు ఓడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. తనకు చూపిస్తున్న ప్రజల ఆదరణకు ధన్యుడనయ్యానని, మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఒక నెల రోజులు ఆగితే విశాఖ తీరానికి మళ్లీ వస్తానని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందని, ప్రజల రుణాన్ని ఏదో రూపంలో తీర్చుకుంటానని ఆయన అన్నారు.

కాంగ్రెసు అవినీతితో రాష్ట్రం పరువు ఇతర రాష్ట్రాల్లో మంట గలుస్తోందని, ఇది మనకు సిగ్గుచేటని, మనం తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు. మత్స్యకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కోస్తా కారిడార్ పేర ప్రభుత్వం ఉపయోగకరమైన భూమిని లాక్కుంటోందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెసు నాయకులకు ఉపాధి లభిస్తోందని, ప్రజలకు హామీలు మాత్రమే మిగులుతున్నాయని ఆయన అన్నారు. అన్నపూర్ణగా పేరు పొందిన రాష్ట్రాన్ని ఆహారం కొరత చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+