మేఘాలయలో రాష్ట్రపతి పాలన
న్యూఢిల్లీ: మేఘాలయలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ప్రధాని మన్మోహన్సింగ్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. అక్కడ ఎన్సీపీ నాయకత్వంలోని డొంకూపర్ రాయ్ ప్రభుత్వానికి 5గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించటంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. బలపరీక్షకు గవర్నర్ ఆదేశించారు. ఆ సమయంలో స్పీకర్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వని ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించకుండా తన ఓటుతో ప్రభుత్వాన్ని గట్టెక్కించారు.
స్పీకర్ చర్యపై విపక్షాలు గవర్నర్కు ఫిర్యాదు చేశాయి. వారి వాదనలోని వాస్తవాన్ని అంగీకరించిన గవర్నర్ బలపరీక్ష సందర్భంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని, మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే శక్తి ఏ పార్టీకి లేనందున రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేశారు. దీనిపై చర్చించిన మంత్రిమండలి ఇందుకు ఆమోదాన్ని తెలిపింది. మంత్రిమండలి తన ఆమోదాన్ని రాష్ట్రపతికి పంపిన అనంతరం రాష్ట్రపతి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications