కత్తి వీరుడు కాంతారావు మృతి
కాంతారావు 1923 నవంబర్ 16వ తేదీన నల్లగొండ జిల్లాలోని కోదాడ మందలం గుడిబండలో జన్మించారు. ఆయన హెచ్ఎం రెడ్డి నిర్మించిన నిర్దోషి చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రతిజ్ఞ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు. విఠలాచార్య దర్శకత్వంలోని పలు జానపద సినిమాల్లో ఆయన కథానాయకుడిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. లవకుశ చిత్రంలోని పాత్రకు ఆయన జాతీయ పురస్కారం వచ్చింది. 2000ల్లో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్తరించింది. ఆయన నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించారు.
Story first published: Monday, March 23, 2009, 9:57 [IST]