హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉలుకెందుకు: చిరుపై దాసరి

By Staff
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao
హైదరాబాద్: ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా చూసి తనను అభినందించిన చిరంజీవి మేస్త్రీ సినిమాపై కూడా అలాంటి సామాజిక దృక్పథమే ప్రదర్శించాలని ప్రముఖ దర్సక నిర్మాత దాసరి నారాయణ రావు ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి హితవు పలికారు. చిరంజీవి బహిరంగ సభల్లో సామాజిక న్యాయం, మార్పు, కుళ్లు కడిగేయడం గురించి మాట్లాడారని, తాను ఆ విషయాలనే మేస్త్రీ సినిమాలో చూపానని, సినిమాను మన కోణాల్లోంచి కాకుండా బాధ్యత గల పౌరుడిగా చూడాలని ఆయన అన్నారు. అయితే ఆయన చిరంజీవి పేరు ప్రస్తావించకుండా ఈ మాటలన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఇది చాలా అవసరమని ఆయన అన్నారు.

వంశీ సంస్థ ఆదివారం సాయంత్రం రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలుగు తల్లికి ఓ తెలుగు పాట అంకిత మహోత్సవ సభలో దాసరి నారాయణరావు మాట్లాడారు. మేస్త్రీ కథ రాసినప్పుడు, దాన్ని సినిమాగా రూపొందించినప్పుడు తాను ఎంతో రసానుభూతికి లోనయ్యానని, విడుదలయ్యాక ఎంతో బాధపడ్డానని, స్వరాజ్యం వచ్చిన తర్వాత ఎన్నో ఎన్నికలు చూశానని, అందరూ చూశారని, ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీస్తే సంభాషణలు పట్టుకుని లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X