నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ తో నాకేమిటి?: డిఎస్

By Staff
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కార్యక్రమం రాజశేఖర రెడ్డిదే, తన కార్యక్రమం తనదేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. తన సొంత జిల్లా నిజామాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటిస్తుండగా తాను హైదరాబాదులో ఉండడంపై బుధవారం మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. తాము రాష్ట్ర స్థాయి నాయకులమని, తాము విడివిడిగా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చునని ఆయన అన్నారు. కోస్తా అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడానికి తాను హైదరాబాదులో ఉన్నానని, తన కార్యక్రమం ప్రకారం తాను వ్యవహరిస్తున్నానని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రితో తనకు ఏలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. విభేదాలు మీడియా సృష్టేనని ఆయన అన్నారు. తాను మీడియా ప్రతినిధులు చెప్పినట్లు నడుచుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఒక సందర్భంలో అన్నారు. తన కార్యక్రమాలు తనకు ఉన్నప్పుడు విభేదాలున్నట్లు ప్రచారం చేయడం తగదని ఆయన అన్నారు. ఇద్దరం కలిసి లాంఛనంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఆ తర్వాత ఎవరి కార్యక్రమం ప్రకారం వారిమి నడుచుకుంటున్నామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X