వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఉగ్రవాదానికి అడ్డా: మన్మోహన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
లండన్‌: ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఉగ్రవాదానికి పాకిస్తాన్ అడ్డాగా మారిందని భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. జి-20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు లండన్‌ వచ్చిన ఆయన మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదులను అదుపు చేయటంలో పాక్‌ ఘోరంగా విఫలమైందని, అందుకే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు. వారిని అదుపుచేయటం పాక్‌కు చేతకాకుండా అయినా ఉండాలి లేదా ఇష్టం లేకుండా అయినా ఉండాలని ఆయన అన్నారు. ముంబయి దాడులకు పాల్పడినవారిపై తాము ఎన్నిసార్లు చెప్పినా చర్య తీసుకోనందునే దాని ఫలితం తెలుస్తోందని అన్నారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించబోమని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా పాకిస్తాన్ పై ఒత్తిడి తేవాల్సిన బాధ్య ప్రపంచం మీద ఉందని ఆయన అన్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకునే ముందు ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తాము సరైన సాక్ష్యాధారాలు ఇచ్చినప్పటికీ ముంబై దాడులు విషయంలో పాక్ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X