హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ వి సత్యం లెక్కలే: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు గెలుపు లెక్కలు సత్యం కంప్యూటర్స్ లెక్కల మాదిరిగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెసు గెలుస్తుందని చెబుతూ ముఖ్యమంత్రి చెబుతున్న లెక్కలపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెసు విజయం సాధ్యం కాదని, తాము మంచి మెజారిటీతో గెలుస్తున్నామని ఆయన చెప్పారు.

తొలి దశ పోలింగ్ జరిగే చోట్ల మహాకూటమికి 110 శాసనసభా స్థానాలు, 17 లోకసభ స్థానాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాలుగు పార్టీలతో ఏర్పడిన తమ మహా కూటమి అత్యంత శక్తివంతమైందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, రాజశేఖర రెడ్డి అవినీతి అభివృద్ధి సాధించారని ఆయన అన్నారు. ప్రజలు రాజశేఖర రెడ్డి అవినీతిని చూసి అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X