నేను తప్పేం మాట్లాడలేదు: వైయస్

తనపై ప్రతిపక్షాలు ఎవరికైనా పిర్యాదు చేసుకోవచ్చునని, ఎన్నికల సంఘానికే కాదు అంతకన్నా పెద్ద సంస్థకు దేనికైనా ఫిర్యాదు చేసుకోవచ్చునని, తానేమీ ఆందోళన చెందడం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ సీనియర్లు తనకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్లనే తన పరపతి ఢిల్లీలో పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. మహా కూటమి గెలిస్తే ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పానని, అదేమీ తప్పు కాదని ఆయన అన్నారు. ఈనాడు దినపత్రికపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. బ్యానర్ ఏం రాశారంటూ పత్రికను తీసుకుని చూశారు. ఈనాడు రాసింది కాబట్టి తాను వ్యాఖ్యానించడానికి సిద్ధంగా లేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమైన వైఖరి తీసుకున్నందుకు తనను కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ అభినందించినట్లు ఆయన తెలిపారు. తెరాసతో 2004 ఎన్నికల్లో పొత్తును వ్యతిరేకించానని, ఆ తర్వాత తన వైఖరిని అధిష్ఠానం సమర్థించిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications