జగన్ కోసమే ముంచుడు: వైయస్

Balakrishna
విజయవాడ: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అయిదేళ్లు దంచుడు, గుంజుడు, ముంచుడుగా పరిపాలన సాగించారని, వైఎస్‌ తన తనయుడు జగన్‌ కోసమే పని చేశారని సినీ నటుడు బాలకృష్ణ విమర్శించారు. కృష్ణా జిల్లా మైలవరం, తిరువూరుల్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలోల్ ఆయన ఆదివారం ప్రసంగించారు. జలయజ్ఞంలో వచ్చేవి నీళ్లు కాదని, అవినీతి ఊబిలో జలగల్లా మారారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గుడిసె లేకుండా చేస్తానని చెప్పిన వైఎస్‌ పేదలతోనే వాటిని పీకించి నిలువ నీడలేకుండా చేశారని ఆరోపించారు. వేలాది ఎకరాల పేదల భూములను సెజ్‌ల పేరిట బడా బాబులకు కట్టబెట్టడమే వైఎస్‌ సాధించిన పారిశ్రామికాభివృద్ధి అని చెప్పారు. ప్రజలు రమ్మంటే రాజకీయాల్లోకి వచ్చానని చిరంజీవి చెప్పడాన్ని ప్రస్తావిస్తూ బొట్టుపెట్టి పిలవటానికి పేరంటమా అని ఎద్దేవా చేశారు. పేదల సంక్షేమం కోసం నగదు బదిలీ పథకం, డ్వాక్రా రుణాల రద్దు, రుణమాఫీ, నెలకు 20 కిలోల బియ్యం, కలర్‌ టీవీ, ఉచిత విద్యుత్తువంటి పథకాలను మేనిఫెస్టోలో పెట్టామని పేర్కొన్నారు.

తాము అధికారంలోకి రాగానే మైలవరం నియోజకవర్గ ఫ్లోరైడ్‌ సమస్య నివారణకు కృష్ణా జలాల సరఫరా, కాలువల ఆధునికీకరణ, సాగర్‌ జలాల సక్రమ సరఫరా, తారకరామా పూర్తి, వైద్య కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పనులు చేపడ్తామని, మైలవరం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకలుగా అభివృద్ధి చేస్తామన్నారు. తాను పుట్టింది, పెరిగింది చెన్నైలో అయినా తనపై ఉన్న అభిమానంవల్లే వేలాది మంది సభలకు తరలివస్తున్నారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+