వైయస్, బాబు ఫిక్సింగ్: చిరు

ఈ ఎన్నికల్లో మనీ, మద్యం ప్రభావం తక్కవగా ఉంటుందని ఆయన అన్నారు. తాను పోటీ చేస్తున్న తిరుపతిలో రాక్షసంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎవరి మీద చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. కల్లు తాగిన కోతిలా వంటి పదాలు వాడడం ద్వారా చంద్రబాబు కల్లుగీత కార్మికులను అవమానిస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ప్రజలు మురిగి పోతారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ఛాంపియన్లం తామేనని ఆయన అన్నారు. రెండో విడత పోలింగ్ జరిగే 141 అసెంబ్లీ స్థానాల్లో 80 శాతం తమకు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications