కాంగ్రెస్ కు సినీ దర్శకుల వార్నింగ్
చెన్నయ్: శ్రీలంక తమిళులను కాపాడటంలో విఫలమైన యూపీఏ నేతలు ప్రధాని మన్మోహన్, సోనియా గాంధీ, ప్రణబ్ ముఖర్జీ తదితరులు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సినీ దర్శకులు హెచ్చరించారు. శ్రీలంక తమిళులకు సంఘీభావంగా శుక్రవారం కొందరు దర్శకులు నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా భారతీరాజా మా ట్లాడుతూ...కేంద్రం తక్షణ చర్యలు చేపట్టకపోతే 2004లో తనకు బహూకరించి న పద్మశ్రీ అవార్డును తిప్పి పంపుతానని హెచ్చరించారు. లంకలో వెంటనే కా ల్పుల విరమణ పాటించేలా ఆ దేశాధ్యక్షుడు రాజపక్షేపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
లంక తమిళుల రక్షణలో విఫలమైన నేతలకు తమిళనాడులో ఓట్లు అర్థించే అర్హత లేదని స్పష్టంచేశారు. తమ హెచ్చరికను పెడచెవినబెట్టి ర్రాష్టానికి వస్తే తమిళ చిత్ర పరిశ్రమ వీలైనన్ని మార్గాలలో నిరసన తెలుపుతుందని ప్రకటించారు. నిరాహార దీక్షకు సీనియర్ దర్శకుడు కె.బాలచందర్ కూడా మద్దతు తెలిపారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications