కాంగ్రెస్ కు సినీ దర్శకుల వార్నింగ్
చెన్నయ్: శ్రీలంక తమిళులను కాపాడటంలో విఫలమైన యూపీఏ నేతలు ప్రధాని మన్మోహన్, సోనియా గాంధీ, ప్రణబ్ ముఖర్జీ తదితరులు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సినీ దర్శకులు హెచ్చరించారు. శ్రీలంక తమిళులకు సంఘీభావంగా శుక్రవారం కొందరు దర్శకులు నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా భారతీరాజా మా ట్లాడుతూ...కేంద్రం తక్షణ చర్యలు చేపట్టకపోతే 2004లో తనకు బహూకరించి న పద్మశ్రీ అవార్డును తిప్పి పంపుతానని హెచ్చరించారు. లంకలో వెంటనే కా ల్పుల విరమణ పాటించేలా ఆ దేశాధ్యక్షుడు రాజపక్షేపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
లంక తమిళుల రక్షణలో విఫలమైన నేతలకు తమిళనాడులో ఓట్లు అర్థించే అర్హత లేదని స్పష్టంచేశారు. తమ హెచ్చరికను పెడచెవినబెట్టి ర్రాష్టానికి వస్తే తమిళ చిత్ర పరిశ్రమ వీలైనన్ని మార్గాలలో నిరసన తెలుపుతుందని ప్రకటించారు. నిరాహార దీక్షకు సీనియర్ దర్శకుడు కె.బాలచందర్ కూడా మద్దతు తెలిపారు.