9కి చేరిన బోలక్ పూర్ మృతులు
హైదరాబాద్: హైదరాబాదులోని భోలక్ పూర్ లోని కలుషిత జలం తాగి అస్వస్థతకు గురై మరణించినవారి సంఖ్య శుక్రవారంనాటికి 9కి చేరుకుంది. బోలక్ పూర్ లో కలుషిత జలం తాగి ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందారు. తాజాగా శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.
తాగేందుకు నీరు లేక బోలక్ పూర్ వాసులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కాగా, తాజాగా కలుషిత జలానికి సంబంధించి ఆరోపణలు హైదరాబాదులోని పలు ప్రాంతాల నుంచి వస్తున్నాయి. తాజాగా హైదరాబాదులోని మలక్ పేట ప్రాంతంలో కలుషితమైన నీరు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు.
Comments
Story first published: Friday, May 8, 2009, 17:23 [IST]