వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయప్రద వైయస్ పాట
తెలుగుదేశం తన పట్ల 'ఉపయోగించుకొని వదిలేసే పద్ధతి'ని అనుసరించినందువల్లే తాను ఆ సైకిల్ను వదిలేసి ఎస్పీ సైకిల్పై ప్రయాణించానన్నారు. టీడీపీ గెలుపులో తాను కీలక పాత్ర వహించినప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనను అవమానించారన్నారు. రాంపూర్ ప్రజలు తనను ఎంతో ఆదరించారన్నారు. అక్కడ కూడా పార్టీలో తాను సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ పార్టీ నాయకత్వం తనకు అండగా నిలిచిందన్నారు. తనను ప్రత్యర్థులు నీచంగా అవమానించినప్పటికీ ఒక మహిళగా ఎన్నో సమస్యలు ధైర్యంగా ఎదుర్కొన్నానని చెప్పారు. సినీతారలను చూడడానికి జనం వేలంవెర్రిగా వస్తారని, అదే తారలు రాజకీయాల్లోకి ప్రవేశిస్తే వారిని నీచంగా చూస్తారని అన్నారు. ఎస్పీ కేంద్ర ప్రభుత్వంలో చేరే అవకాశాలు లేకపోలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Tuesday, May 19, 2009, 9:08 [IST]