హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టును ఆశ్రయించిన వైయస్ జగన్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, నరసరావుపేట మొదటి అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జారీ చేసిన వారెంట్‌ అమలును నిలిపివేయాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గత నెల 9న జగన్‌ నిర్వహించిన రోడ్‌ షో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆయనతోపాటు మరో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వీరిలో కాసు వెంకటకృష్ణారెడ్డి, వల్లభనేని బాలశౌరి, కాసు మహేష్‌రెడ్డి తదితరులున్నారు. వీరందరూ కేసు నమోదైన మరుసటి రోజే పోలీసుస్టేషన్‌లో హాజరై బెయిలు పొందగా జగన్‌ మాత్రం హాజరుకాలేదు. దీంతో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయగా మేజిస్ట్రేట్‌ నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేశారు. దాన్ని చట్ట విరుద్ధంగా నమోదు చేసిన కేసు అంటూ దాన్ని కొట్టివేయాలని జగన్‌ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు అనుగుణంగానే రోడ్‌ షో నిర్వహించినట్లు పేర్కొన్నారు. వారెంట్ల అమలుతోపాటు మేజిస్ట్రేట్‌ కోర్టులో కేసు తదుపరి విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X