వైయస్ ను ఎదుర్కుంటాం: బాబు

దురదృష్టవశాత్తు తమ పార్టీ అధికారంలోకి రాలేదని, పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయని, వాటిని విశ్లేషించి, మరోసారి ఈ తప్పిదం జరక్కుండా జాగ్రత్త పడతానన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం ఓట్లు వస్తే ప్రతిపక్షాలకు 64 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నామన్న గర్వంతో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిపితే సహించమని, కాదని ముందుకొస్తే ఎదుర్కొనే సత్తా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత మంది కార్యకర్తలున్నారో తమ పార్టీకీ అంతే సంఖ్యలో ఉన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. తమ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా గొడవలకు దిగబోరని, అలాగని రెచ్చగొడితే ఎదురు తిరుగుతామని అన్నారు. కుప్పంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు పెచ్చుమీరాయని ఆరోపించారు. గ్రామాలకు గ్రామాల్లో కరెంటు కనెక్షన్లు తొలగించడం, తాగునీరు రాకుండా అడ్డుకోవడం, తెదేపా కార్యకర్తలపై దౌర్జన్యాలు వంటి చర్యలకు పూనుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications