తెలంగాణపై వెనక్కి తగ్గం: బాబు

ఎన్నికల సమయంలో పని చేసి, ఇతర సమయాల్లో పని చేయకపోవడం సరి కాదని, అన్ని వేళలా సవాళ్లను ఎదుర్కోవడానికి పని చేయాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా, మారిన పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలను చేపట్టే ఆలోచన చేయాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. తాము ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. నగదు బదిలీ పథకంపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.
రాష్ట్రంలో బియ్యం ధర పెరుగుతోందని, రైతుల వరి ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్, టిడిపి మాత్రమే ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు పడేదని, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి తమకు నష్టం జరిగిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెసు పార్టీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టినట్లు ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యం చిన్నబోయే విధంగా కాంగ్రెసు పార్టీ డబ్బులు ఖర్చు పెట్టిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications