మరో భారత విద్యార్థిపై దాడి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా 25 ఏళ్ల బల్జీందర్ సింగ్ అనే విద్యార్థిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు 'హెరాల్డ్ సన్' పత్రిక తెలిపింది. ఇద్దరు దుండగులు బల్జీందర్ సింగ్ను డబ్బు ఇవ్వాల్సిందిగా తొలుత డిమాండ్ చేశారని, అతను పర్సు కోసం వెతుకుతున్న సమయంలో కత్తితో పొత్తికడుపులో పొడిచారని రాసింది. "నన్ను చంపొద్దంటూ వేడుకున్నా. బిగ్గరగా అరిచా.. అయినా వారు కనికరించలేదు. వెకిలిగా నవ్వుతూ నా కడుపులో పొడిచారు" అని సింగ్ చెప్పాడు. మెల్బోర్న్ పట్టణం జీవించడానికి అనువైనదిగా భావించానని, అయితే ఇక్కడి భారతీయ విద్యార్థులే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడుతున్నారని అన్నాడు.
ఆస్ట్రేలియాలో నాలుగు రోజుల క్రితం దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు ఇప్పుడు మరో చేదు అనుభవం ఎదురైంది. చికిత్స నిమిత్తం గాయపడిన నలుగురు విద్యార్థులు ఆసుపత్రిలో ఉండగా అదే అదనుగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇళ్లను కొల్లగొట్టారు. అందినకాడికి దోచుకుని పరారయ్యారు. "దుస్తులతో సహ చేతికందిన ప్రతి వస్తువునూ దోచుకెళ్లారు. ఈ ఘటన వల్ల అభద్రతా భావంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు" అని అక్కడి భారతీయ విద్యార్థుల సంఘం (ఫిసా) అధ్యక్షుడు గౌతం గుప్తా అన్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications