హైదరాబాదు: జనహితం కోసం, జాతి లక్ష్యాల కోసం, యువత భవిష్యత్తు కోసం లోకసత్తా పోరాడుతుందని ఆ పార్టీ అథినేత, కూకట్ పల్లి ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ అన్నారు. బుధవారం ఉదయం తొలి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన జేపీ మీడియాతో మాట్లాడారు. సమాజంలో సమస్యల పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని, ఆ కార్యక్రమాన్ని లోకసత్తా నిర్వర్తిస్తుందని జేపీ తెలిపారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను తమ పార్టీ తరపున లేవనెత్తుతానని జేపీ ఉధ్ఘాటించారు.