వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమానంతో ఐదుగురి అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: దక్షణాది రాష్ట్రాల్లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని ఓ లాడ్జీలో పోలుసుల తనిఖీలు చేపట్టి అనుమానస్పదంగా వ్యవహరిస్తున్న ఐదుగురు ముస్లిం యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 8 కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.

విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు, అంతటా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె ప్రజలకు సూచించారు. ఉగ్రవాదుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆమె కోరారు. ఉగ్రవాదాన్ని అణచడానికి తాము అన్ని చర్యలూ చేపట్టినట్లు ఆమె తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X