భట్టి విక్రమార్క ప్రభుత్వ చీఫ్ విప్

ఖమ్మం జిల్లాలో సీపీఎంను దెబ్బతీసి కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చే ప్రక్రియలో మల్లు భట్టివిక్రమార్క క్రియాశీలకంగా వ్యవహరించారని పార్టీ నమ్ముతోంది. అంతేకాక గతంలో తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ తెలంగాణ సీనియర్లు ఢిల్లీకి వెళ్లినపుడు, మల్లు భట్టివిక్రమార్క మరికొందరు వెళ్లి వారికి వ్యతిరేకంగా అభివృద్ధి వాదాన్ని వినిపించారు. ప్రస్తుత తెలంగాణ వద్దని, అభివృద్ధి చెందిన తెలంగాణ కావాలని గళం విన్పించారు. ఇది కూడా ఆయనకు అనుకూలించింది. భట్టి సోదరుడు, సీనియర్ నాయకుడు మల్లురవి ఈ సారి జడ్చర్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో చీఫ్విప్ పదవి మల్లు భట్టి విక్రమార్కకు దక్కింది. గతంలో మల్లురవి విప్గా వ్యవహరించారు.రాష్ట్ర మంత్రివర్గంలో నలుగురే ఎస్సీలకు స్థానం లభించింది. శాసనసభకు రెండో సారి ఎన్నికైన వారిలో శైలజానాథ్, కొండ్రుమురళీమోహన్ ఉన్నారు.












Click it and Unblock the Notifications