హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పర్యావరణాన్ని పరిరక్షించండి: సిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురష్కరించుకుని ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో గ్రీన్‌ ర్యాలీని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

మరోవైపు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు పది ప్రభుత్వ శాఖాల ఆధ్వర్యంలో నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాదులో పర్యావరణ పరిరక్షణ సమితి ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా 20 వేల మొక్కలు నాటనున్నట్లు సమితి కన్వీనర్ శ్రీనివాస్ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి సాంఘిక బాధ్యత అని ఆయన అన్నారు. విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X