కాగ్రేస్ లో చేరనంతే
న్యూఢిల్లీ:మాతృసంస్థ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని లోక్సభ మాజీ స్పీకర్ పీఏ.సంగ్మా స్పష్టం చేశారు. అలాగే, ఎన్.సి.పిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే పరిస్థితే లేదన్నారు. ఆయన ఈ మధ్య ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసారు. దీంతో ఆయన తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే అంతటా వినిపిచింది. దీనిపై ఆయన స్పందిస్తూ తన కుమారుని వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధానిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశానని ,తమ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరే అంశం ప్రస్తావనకు రాలేదన్నారు.
తమ పార్టీ అధినేత శరద్ పవార్తో తనకి మంచి సంబంధాలు కలిగివున్నట్టు సంగ్మా చెప్పారు. ఆయనే మా నాయకుడు అని తేల్చి చెప్పారు. సోనియా గాంధీ విదేశీయత అంశం దీర్ఘకాలికం కాదని అందువల్ల ఎన్సీపీని కాంగ్రెస్లో విలీనం చేయాలని పలువురు కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. దీనిపై మాట్లాడుతూ, ఎన్.సి.పి. జాతీయ పార్టీ హోదాను పొందిందని సమాధానం ఇచ్చారు.
సోనియా గాంధీ విదేశియతను ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేతల్లో పీఏ.సంగ్మా ఒకరు. ఈ తరుణంలో సరిగ్గా పదేళ్ళ తర్వాత ఆయన సోనియాను కలిసి తాను చేసిన తప్పుకు క్షమాపణలు కోరారు. అంతేకాకుండా, తన కుమారుని వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.