ఆంధ్రా హోటళ్ళపై కెసిఆర్ దాడులు
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఆంధ్రా హోటళ్లపై దాడులు జరగడం తెరాస అధినేత కేసీఆర్ కపటత్వానికి, అసమర్థతకు పరాకాష్ఠ అని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ అధ్యక్షుడు కె.శ్రీనివాసరాజు శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ హింసా మార్గాన్ని ఎంచుకున్నట్లు ఈ ఘటన ద్వారా అవగతమవుతోందన్నారు. బాధితులకు పరిహారాన్ని చెల్లించాలని, సెటిలర్ల ఆస్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Story first published: Sunday, June 21, 2009, 14:15 [IST]