వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటి ఇస్తా..రేప్ చేయించుకో!!

By Staff
|
Google Oneindia TeluguNews

Rita Bahuguna Joshi
న్యూడిల్లీ: మాయావతిని అత్యాచారం చేయించుకోమనండి. కోటి రూపాయలు సాయం చేస్తామని చెప్పండి అంటూ ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి చేసిన వ్యాఖ్యలు అంతటా సంచలనం సృష్టిస్తున్నాయి. మీరట్‌ రేప్‌ బాధితురాలికి, అత్యాచారానికి గురైన మరో మూగ, చెవిటి బాలికకుచెరో రూ.25 వేలు ఇచ్చి కేసులు మాఫీ చేశారు. హత్యకు గురైన ఇంకో బాలిక కేసు మూసేయడానికి ఆ బాలిక తండ్రికి 75 వేలు ఇచ్చారు. కేసుల మాఫీకి డబ్బులిస్తారా? ఇదేనా న్యాయం? అంటూ ఆమె మాయావతిని నిలదీయటంపై దుమారం రేగుతోంది.

మాయవతిపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రీటా బహుగుణ జోషిని అరెస్ట్‌ చేసి 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. రీటాకు మొరాదాబాద్‌ కోర్టు తాత్కాలిక బెయిల్‌ను ఇచ్చేందుకూ తిరస్కరించింది. మరోవైపు, జోషి ఇంటిపై బిఎస్పీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న వ్యక్తుల దాడి చేసారు. బహిరంగ సభలో రీటా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు మౌనం వహించారంటూ మాయావతి, సోనియాగాంధీపైనా మండిపడ్డారు.

అలాగే ఈ వ్యాఖ్యలు లోక్‌సభలో గందరగోళానికి దారితీయడమే కాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతునిస్తున్న బిఎస్పీ మద్దతు ఉపసంహరణపై ఆలోచనలో పడే వరకూ వెళ్ళింది. అయితే తాను చేసిన వ్యాఖ్యలు మాయావతిని బాధపెట్టిఉంటే క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నా.. ఆమె హింసాత్మక చర్యలకు దిగుతున్నారని రీటా ఆరోపించారు. ఇదంతా తనమీద పన్నుతున్న కుట్రలో భాగమేనని విమర్శించారు. జిల్లా జైల్లో ఉన్న రీటాను మాజీ క్రికెటర్‌, మొరాదాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అజారుద్దీన్‌ పరామర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X