అబ్దుల్ కలామ్ కు అవమానం
విమానం ఎక్కడానికి ముందు బూట్లు విప్పాలని కలామ్ శరీరాన్ని సోదా చేస్తూ అడిగారు. ఆయన వస్తువులను ఎక్స్ రే మిషన్ తో తనిఖీ చేశారు. అయితే తాము ఈ తనిఖీలు చేయలేదని దేశంలోని విమానాశ్రయాల్లో భద్రతా బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేశారు. ఆ పనికి పాల్పడింది ఎయిర్ లైన్ సిబ్బందేనని అంటున్నారు.
అయితే కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ తన చర్యను సమర్థించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులందరితో పాటు విఐపిలను కూడా తనిఖీ చేస్తున్నట్లు ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి ఒక టీవీ న్యూస్ చానెల్ తో చెప్పారు. కలామ్ సంతోషంగా తనిఖీలకు అంగీకరించారని కూడా చెప్పారు. ఈ సంఘటనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని పౌర విమాన యానాల మంత్రి ప్రఫుల్ పటేల్ చెప్పారు. అవసరమైతే క్షమాపణలు చెప్పాలని ఎయిర్ లైన్స్ ను అడుగుతామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.