హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మగధీర సినిమాకు వచ్చి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Magadheera
కర్నూలు: కర్నూలు జిల్లా నందికొట్కూరులో శుక్రవారం అర్ధరాత్రి 'మగధీర' సినిమాకు వచ్చిన ఓ యువకుడు విద్యుదాఘాతానికి మృతి చెందాడు. జూపాడు బంగ్లా మండలం పి.లింగాపురం గ్రామవాసి బాలరాజు(30) స్నేహితులతో కలిసి నందికొట్కూరులోని శివశంకర్‌ టాకీస్‌ కు వచ్చాడు. బెనిఫిట్‌ షో కారణంగా రెండో ఆట ఆలస్యంగా మొదలవడంతో టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు.

ఈ క్రమంలో ఒకరిమీద ఒకరు నిలిచి, చేతులు చాచారు. ఈ సమయంలో బాలరాజుతోపాటు నాగశేషులు(28), అభిమన్యుడు విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌ కు గురయ్యారు. వీరిలో కుప్పకూలిన బాలరాజు, నీళ్ల పాకెట్‌ తెప్పించి తాగించేలోపే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న ఎస్‌ ఐ నరసింహారావు సిబ్బందితో వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్‌ డివిజన్‌ నాయకుడు వెంకటరమణ మాదిగ థియేటర్‌ యజమానిని కోరారు. బాలరాజు కుటుంబాన్ని తాము ఆదుకుంటామని, తగిన సాయం అందిస్తామని చిరంజీవి అభిమానుల సంఘం ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X