హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ పాలనలో బాంబులే: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాదును అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ పాలనలో బాంబులు వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ తనపై చేసిన విమర్శలకు ఆయన సోమవారం శాసనసభలో సమాధానమిచ్చారు. లుంబినీ పార్కువంటి వాటిని తాము అభివృద్ధి చేస్తే వైయస్ పాలనలో లుంబినీ పార్కులో, మక్కా మసీదులో బాంబులు వేశారని ఆయన అన్నారు.

హైదరాబాదు అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని వైయస్ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. హైదరాబాద్ అభివృద్ధి ఏమైనా జరిగిందంటే అది తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చంద్రబాబు అన్నారు. వైయస్ తీరు చూడబోతుంటే చార్మినార్ ను, గొల్కొండను తానే కట్టించానని అనేట్లున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం వల్లనే వైయస్ పాలనలో ఫ్లై ఓవర్లు కూలుతున్నాయని ఆయన అన్నారు. తన ఆస్తులపై, వైయస్ ఆస్తులపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణకు తాను సిద్ధమని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రెఫరెండానికి కూడా తాను సిద్ధమని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X