బాబు అవమానిస్తున్నారు: చిరు

Chiranjeevi
హైదరాబాద్: ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సభలో తమను అవమానిస్తున్నారని ప్రజారాజ్యం పక్ష నాయకుడు చిరంజీవి అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి, చంద్రబాబుకు మధ్య సోమవారం శాసనసభలో జరిగిన వాగ్వివాదంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రేక్షకులుగా మారుస్తున్నారని ఆయన అన్నారు. వారిద్దరు పరస్పరం వాదించుకుంటూ విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆయన విమర్శించారు.

వైయస్, చంద్రబాబు అసెంబ్లీని ఎన్నికల ప్రచార సభగా మారుస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. ప్రజాసమస్యలు చర్చకు రాకుండా, ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ కూడా సభా వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+