వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళకు బాంబు బెదిరింపులు

By Staff
|
Google Oneindia TeluguNews

Kerala on Alert
కన్నూరు: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో బాంబులు పేలే ప్రమాదం ఉందని కేరళ సైబర్ పోలీసు సెల్ కు ఇ మెయిల్ బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చాయి. ముస్లింల జనాభా అధికంగా ఉన్న ఉత్తర కేరళ జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆగంతకులు డిమాండ్ చేశారు.

ఇ మెయిల్ బెదిరింపులు గురువారం సాయంత్రం కొన్ని మీడియా సంస్థలకు కూడా వచ్చాయని పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ టామిన్ జె. థాచెంకరీ చెప్పారు. ఇమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని కనిపెట్టామని ఆయన చెప్పారు. కంప్యూటర్ ఐపిని కనుక్కోవడానికి ప్రాథమిక సమాచార నివేదిక రావాల్సి ఉందని ఆయన చెప్పారు.

ఇ మెయిల్ జకీర్ హుస్సేన్ పేర వచ్చింది. తాను కొత్తగా ఏర్పాటు చేసిన మలబార్ ముజాహిద్ హెడ్ నని చెప్పుకున్నాడు. దాని కేంద్ర కార్యాలయం కరాచీలో ఉన్నట్లు తెలిపాడు. తమకు ఐఎస్ఐ, లష్కరే తోయిబా మద్దతు ఉందని చెప్పుకున్నాడు. శుక్రవారం బాంబు పేలుళ్లు ప్రారంభమవుతాయని బెదిరించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X