రాజకీయాలు వద్దు: సిఎం

జాతీయ ఉపాధి హామీ పథకం వల్ల రోజుకు 50 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని, ఈ పథకాన్ని తాము సమర్థంగా, పారదర్శకంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. రాజీవ్ గాంధీ ఆరోగ్య శ్రీ వల్ల పేదలకు మేలు జరుగుతోందని, ఈ పథకాన్ని తమ సీనియర్ నేత జి వెంకటస్వామి కూడా ప్రశంసించారని ఆయన చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా చూస్తున్నామని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా కరవుపై చర్చిద్దామని ఆయన సూచించారు. ఏ పేదవాడికి కూడా ఇబ్బంది కలగకుండా పథకాలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
దుర్భిక్ష ప్రాంతాల్లో రైతులను, కూలీలను ఆదుకోవడానికి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతుల ఆత్మహత్యలు జరగకుండా చూస్తామని తాను చెప్పడంలో తప్పేమీ లేదని, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికే తాను ఆ మాట అన్నానని, అంత మాత్రాన ఎక్కడైనా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అది తన ప్రకటన తప్పు కాదని, ఎవరైనా చనిపోతే ధైర్యం చెప్తామని, అదే పద్ధతిలో తాను ఆ మాట అన్నానని ఆయన చెప్పారు. రైతులను తాము నిర్లక్ష్యం చేయడం లేదని ఆయన చెప్పారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు.
లక్ష రూపాయల నష్టపరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అంటూ గత తెలుగుదేశం ప్రభుత్వం ఆ నష్టపరిహారాన్ని రద్దు చేసిందని, తాము 24 గంటల లోగా రైతు మరణిస్తే కుటుంబానికి లక్షన్నర రూపాయలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచడం అవసరమని, వారిని నైతికంగా దెబ్బ తీయకూడదని, గతంలో రైతుల ఆత్మస్థయిర్యం దెబ్బ తినేలా వ్యవహరించారని ఆయన అన్నారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కరీంనగర్ నుండి కొండగట్టుకు కేంద్రమంత్రి అంజన్న ఆశీర్వాద యాత్ర -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
YS జగన్ ఎమోషనల్: వైసీపీ ఆవిర్భావ వేళ కీలక ప్రకటన -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications