స్వైన్ ఫ్లూ మృతులు 44 మంది

స్వైన్ ఫ్లూ మరణాల విషయంలో కర్నాటక రెండో స్థానానికి చేరుకుంది. కర్నాటకలో 11 మంది మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 24 మంది మరణించారు. పూణేలోనే 16 మంది చనిపోయారు. గుజరాత్ లో ఐదుగురు మరణించారు. కేరళ, తమిళనాడుల్లో ఒక్కరేసి మృతి చెందారు.
కొత్తగా దేశంలో 159 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 2,401కి చేరుకుంది. ఢిల్లీలో గురువారం తొలిసారి ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. కర్నాటకలో కృష్ణవేణి, కల్పన అనే ఇద్దరు మహిళలు గురువారం మరణించారు. ప్రేమ ఈ నెల 16వ తేదీన మరణించింది. ఎడ్వర్డ్ మోహన్ బుధవారం మరణించాడు.












Click it and Unblock the Notifications