ఈనాడుపై చిరంజీవి మండిపాటు

Chiranjeevi
హైదరాబాద్: ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తీవ్రంగా మండిపడ్డారు. తాము కొమ్ము కాసే పార్టీకోసం తమపై ఈనాడు తప్పుడు వార్తలు రాస్తోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఏ పార్టీలో అసమ్మతివాదులు లేరు, ఏ పార్టీ నుంచి వెళ్లిపోవడం లేదు, తమ పార్టీనుంచి వెళ్లిపోతే పెద్ద వార్త అవుతుందని, మిగతా పార్టీల నుంచి వెళ్లిపోతే తక్కువ స్థాయి వార్తలు అవుతాయా అని ఆయన అన్నారు. జెండా పీకేద్దామని రాయడం అషామాషీ వ్యవహారం కాదని ఆయన అన్నారు. తొలుత తమకు పార్టీ పెట్టే సందర్భంలో మద్దతు ఇచ్చాయని, తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు పార్టీ దెబ్బ తీయలేదనే ఉద్దేశంతో తమకు మద్దతిచ్చాయని, తెలుగుదేశం పార్టీ పుంజుకోగానే తమను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు.

జన్మనిచ్చిన తల్లి గొంతు కోసే విధంగా ఈనాడు వార్తా కథనం ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో మూడో పార్టీకి స్థానం లేదా అని ఆయన అడిగారు. తమ పార్టీలో ఎవరూ ఏమీ మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని సార్లు రాసిన రాతలు తప్పని చెప్పాలని ఆయన అన్నారు. పార్టీలో అభద్రత కలిగించే విధంగా, ఆందోళన కలగజేసే విధంగా వ్యతిరేక వార్తలు రాస్తున్నారని ఆయన అన్నారు. తాము ఉండకూడదని ప్రజలు అనుకుంటే సరే, పత్రికలు కాదని ఆయన అన్నారు. ఆ పత్రికలు ప్రజల పక్షాన నిలబడడం లేదని, స్వార్థ ప్రయోజనాలతో పని చేస్తున్నాయని అన్నారు. ప్రజలు లేని రాజ్యమంటూ గతంలో కూడా వార్తలు రాశారని ఆయన గుర్తు చేశారు. ఓటమికి సొంత కారణాలు, ఇతర కారణాలు కూడా ఉండవచ్చునని ఆయన అన్నారు. శాసనసభ ఉంది కాబట్టి ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని, తాము ప్రజల్లోకి వెళ్తామని ఆయన అన్నారు. ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు. తాను ఏ జిల్లాకు వెళ్లినా లక్షలాది మంది వస్తారనే విషయం తాను చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+