కరవుపై టిడిపి, లెఫ్ట్ పాదయాత్ర

కరవు సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం నుంచి తగిన నిధులు రాబట్టడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వారికి ధైర్యాన్నిచ్చి వాటిని ఆపాల్సిన అవసరం ఉందని, ఈ విషయాలను వేటినీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
కరువుకు, బ్యాంకర్ల సమావేశానికి ముడిపెట్టడం సరి కాదని చంద్రబాబు అన్నారు. కరవుపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం నొక్కేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. బేషజాలకు వెళ్లకుండా వాస్తవాలను ముఖ్యమంత్రి సభకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications