వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద చేపలు పట్టండి: పిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: ఉన్నతస్థాయి అవినీతిపై దృష్టి సారించాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిబిఐకి, రాష్ట్ర అవినీతి నిరోధక శాఖల అధికారులకు సూచించారు. పెద్దచేపలను పట్టడంపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన అన్నారు. పెద్దచేపలు శిక్ష నుంచి తప్పించుకోవడం సులభమనే అభిప్రాయాన్ని తిరగరాయాలని ఆయన అన్నారు. సిబిఐ, రాష్ట్రాల అవినీతి నిరోధక శాఖల అధికారుల సమావేశాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు.

అవినీతిపై పోరుకు ఒక పరిష్కారం మాత్రమే లేదని, వివిధ స్థాయిల్లో అవినీతిపై పోరాటం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దర్యాప్తు వేగవంతంగా జరగడం అవసరం, ముఖ్యమని ఆయన అన్నారు. దర్యాప్తులు వేగవంతంగా జరిగినంత మాత్రాన సరిపోదని విచారణలు, తీర్పులు కూడా వేగంగా జరగాలని ఆయన అన్నారు. కొత్తగా 71 సిబిఐ కోర్టులను స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇవి అదర్శవంతమైన కోర్టులుగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X