వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ సంతాప సభకు బ్రేక్

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు కార్యకర్తలు వైయస్ సంతాపసభను ఛిన్నాభిన్నం చేశారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో ఏర్పాటైన సభను కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైయస్ ను సిఎంగా ప్రకటించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తూ గొడవకు దిగారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

డి. శ్రీనివాస్ ఎంతగా సర్ది చెప్పినా వారు వినలేదు. మీ అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానవర్గానికి వినిపిస్తామని, మౌనంగా ఉండాలని వైయస్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి చేసిన విజ్ఞప్తిని కూడా వారు ఖాతరు చేయలేదు. దీంతో సభను అర్థాంతరంగా ముగించారు. వక్తలెవ్వరూ ప్రసంగించలేదు. ఈ సభలో మాజీ ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు తదితర ముఖ్యనేతలు ఈ సమావేశానికి వ్చచారు. వైయస్ సన్నిహిత మిత్రుడు కెవిపి రామచంద్రరావు గద్దించిన తర్వాత కార్యకర్తలు మౌనం వహించారు. ఆ తర్వాత సంతాపం ప్రకటించినట్లు, సభను ముగిస్తున్నట్లు డి. శ్రీనివాస్ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X