Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అంధ్ర నేతపై తొందరేం లేదు: ప్రణబ్

Pranab Mukherjee
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కొత్త నేతను ఎంపిక చేసేందుకు కొంత సమయం పడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతి వల్ల నెలకొన్న భావోద్వేగం సమసిపోవాలని, అప్పుడే నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఒత్తిడి పెరుతున్నప్పటికీ కాంగ్రెసు అధిష్ఠాన వర్గం మాత్రం ఏ విధమైన హామీ ఇవ్వడం లేదు. జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తారా అని వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేస్తూ వెళ్లారు.

మహిళా జర్నలిస్టులతో శుక్రవారం సాయంత్రం జరిగిన ఇష్ఠాగోష్టిలో ఆయన ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వ మార్పుపై మాట్లాడారు. అది పెద్ద సమస్యేం కాదని, ఆంధ్రప్రదేశ్ పెద్ద నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమని, దాంతో భావోద్వేగమైన ఆందోళన చోటు చేసుకుందని, రాష్ట్రంలో నాయకత్వ మార్పు సమస్యకు మార్గం దొరుకుతుందని ఆశిస్తున్నామని, దానికి చాలా సమయం పట్టవచ్చునని, ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయమూ తీసుకోలేదని ఆయన వివరించారు. అయితే ఎక్కువ కాలం కూడా తీసుకోవాలని పార్టీ అధిష్ఠాన వర్గం భావిస్తోంది. వారం, పది రోజుల్లో సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చునని భావిస్తున్నారు.

తమ నిర్ణయానికి జగన్ తలొగ్గేలా చేయాలనేది పార్టీ అధిష్ఠానవర్గం వ్యూహంగా కనిపిస్తోంది. అంత వరకు రోశయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అనుకుంటోంది. ఈ స్థితిలో పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనేది లేదని, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రేనని ఆయన అన్నారు. ప్రమాణం స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, మంత్రి వర్గ సభ్యులున్నారని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+