హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో మరో స్వైన్ మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Swine flu
హైదరాబాద్: హైదరాబాదును స్వైన్ ఫ్లూ భయం వణికిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరో స్వైన్ ఫ్లూ మృతి సంభవించింది. హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో మాధవి అనే మహిళ స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆదివారం ఉదయం మరణించింది. గ్లోబల్ అవేర్ అనే ఆస్పత్రిలో ఈ మరణం సంభవించింది. దీంతో హైదరాబాదులో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 8కి చేరుకుంది.

శనివారం ఒక్కరోజే హైదరాబాదులో స్వైన్ ఫ్లూతో ముగ్గురు మరణించారు. దీంతో కలకలం చెలరేగింది. హైదరాబాదులోని రాంనగర్ కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి రాజబాబు స్వైన్ ఫ్లూతో మరణించాడు. బంజారా హిల్స్ కు చెందిన కటకం శ్రీకాంత్ అనే పాతికేళ్ల యువకుడు ఆ కొద్దిసేపటికే మృత్యువాత పడ్డాడు. తుమ్మ సునీల్ కుమార్ అనే 27 ఏళ్ల యువకుడు అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో మరణించాడు. ఇతను మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X